19, ఆగస్టు 2014, మంగళవారం

జయ మంత్రం

హనుమంతుడు సీతామాతను వెతుకుతూ సముద్ర లంఘనం చేసి లంకాపురికి చేరుకున్నాడు. అక్కడ అతి కష్టం మీద సీతామాత జాడ తెలుసుకుని, పది నెలలుగా ఆమె పడుతున్న భాదను తొలగించి, రావణాసుర బలాబలములను చూడాలన్న కోరికతో అశోక వనాన్ని ద్వంసం చేయుట మొదలుపెట్టాడు. అది చూసిన రావణ సేవకులు రావణునికి విషయం చెప్పగా, హనుమంతుని భందించమని తన సైన్యాన్ని పంపించాడు. అప్పుడు హనుమ తోరణం మీద కూర్చుని చెప్పిన ఈ మంత్రాన్ని జయ మంత్రం అంటారు.


జయ త్యతిబలో రామో లక్ష్మణశ్చ  మహాబాలః 
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః  
దాసోహం కోసలేంద్రశ్య రామస్యాక్లిష్ట కర్మణః  
హనుమాన్ శతృుసైన్యానాం నిహంతా మాఱుతాత్మజః

న రావణ సహాస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ 
శిలాభిస్తూ ప్రహారతః  పాదపైశ్చ సహస్రశః  
అర్ధాయిత్వా పురీమ్ లంకా అబీవాద్య చ మధిలీం  
సమృద్ధర్ధో గమిష్యామి మిషాతాం సర్వరక్షసాం 

భావం : 
"రాముడు, లక్ష్మణుడు, విశేషమైన బలం తో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ. నేను యుద్ధంలో వేరే ఆయుధములు వాడను. ఈ రావణ సైన్యాన్ని నా అరీకాళ్ళ కింధ పెట్టి తొక్కేస్తాను. నా పిడి గుద్దులతో ఛంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లతో, రాళ్లతో, కొడతాను. వెయ్యిమంది రావణాశురులు నా భుజాల కింధ ఒక కీటకం తో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణం లో లేదు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో, అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్లిపోతాను. నన్ను పట్టగలిగే మోనగాడు ఈ లంకాపట్టణంలో లేడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి