11, జులై 2014, శుక్రవారం

శ్రీకృష్ణుడిని కొడుకుగా లాలించగలగటానికి నoద యశోదలు ఏమి పుణ్యం చేసారు?

శ్రీకృష్ణుడిని కొడుకుగా లాలించగలగటానికి నoద యశోదలు ఏమి పుణ్యం చేసారు?

అష్ట వసువులలో ప్రధానుడు ద్రోణుడు, అతని భార్య ధర.

 శ్రీమన్నారాయణుడు భూలొకంలో అవతరిoచబోతున్నాడు కనుక సర్వ దేవతలు, ఋషులు భూమిపై  పుట్టాలి అని బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు అందరు దేవతలు సరే అని చెప్పి వెళ్ళిపోయారు కానీ ద్రోణుడు, ధర మాత్రం ఇంకా అక్కేడే ఉన్నారు. వారిని చుసిన బ్రహ్మ దేవుడు ఏమి మీకోరిక అని అడుగగా వారు ఆ పరమాత్మను తమ బిడ్డగా సేవిస్తూ అతని అన్ని బల్యోపచారాలను ఆనుభవిస్తూ ఆ పరంధాముని పై అమిత భక్తీ కలిగి తమ అన్ని జన్మల దుర్గతులనూ పోగొట్టుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పారు. వారి మాటలు విన్న బ్రహ్మ వారి మాటలలోని ఆర్ద్రత చూసి అలాగే అని చెప్పారు.  ఆ ద్రోణుడు నందునిగా, అతని భార్య ధర యశోదగా జన్మించారు.

ఐతే వీరు ఆ పరమాత్మను తమకు జన్మించాలీ అని కోరలేదు, కేవలం అతని బాలోపచారాలను చేయాలి అని కోరుకున్నారు కనుక దేవకీ వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు నంద వ్రజానికి వచ్చి నంద యశోదలకు పుత్రునిగా పెరిగాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి