16, జులై 2014, బుధవారం

శంతనుడు జన్మవృత్తాంతం

శంతనుడు పుర్వకాలo లో సుర్యవంశం లో జన్మించిన మహాభిషుడు అనే రాజు. ఇతను 1000 అశ్వమేధ యాగములు, 100 రాజసూయ యాగములు చేసిన కారణం చేత స్వర్గాలోకమునకు వెళ్ళాడు. ఒకసారి దేవతలంతా బ్రహ్మదేవుని దర్శనార్ధమై సత్యలోకం వెళుతుండగా ఈ   మహాభిషుడు కూడా వారితో వెళ్ళాడు. అక్కడకు దేవగంగ కూడా వచ్చింది. బ్రహమదేవుడు సభతీర్చి ఉండగా ఒక్కసారిగా వచ్చిన గాలివల్ల ఆ గంగాదేవి పైట కొంచెం చెదిరింది. అది గమనించిన దేవతలు తమ తలలను దించుకుని ఉన్నారు అయినా కూడా ఈ మహాభిషుడు రెప్పపాటు లేకుండా గంగాదేవిని చుస్తూ ఉన్నాడు. అది గమనించిన బ్రహ్మదేవుడు మహాభిషుడు ని ఉద్దేసించి, "ఓ మహాభిషా నీకు ఇంకా కోరికలు నశించినట్లు లేవు కనుక నీవు మరలా భూలోకం లో జన్మించు, నీవు ఇప్పుడు ఏ గంగ ను చూసి సభామర్యాదకు భంగం కలిగించావో అదే గంగను అక్కడ పొంది, ఆమె మీద నీకు కలిగిన కోపం కారణం గా మాత్రమే నీ శాప విమోచనం పొందగలవు" అని చెప్పాడు. అది విన్న మహాభిషుడు భూలోకం లో తానూ ఎవరికీ జన్మించాలి అని చూస్తుండగా అతనికి చంద్రవంశంవాడయిన ప్రతిశ్రవుడు (ప్రతీపుడు) సరిఐనవాదు అని నిర్ణయించుకుని అతనికి జన్మించాడు. ఆ పుట్టిన పిల్లవానికి ప్రతిశ్రవుడు శంతనుడు అని నామకరణం చేసారు.

శంతనుడు తరువాతి కాలం లో గంగాదేవిని వివాహం చేసుకుని భీష్ముని, సత్యవతి వల్ల చిత్రాoగదుడిని, విచిత్రవీర్యుని పుత్రులుగా పొందాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి