11, జనవరి 2016, సోమవారం

త్రిలింగ క్షోణి వైకుంఠం

"త్రిలింగ క్షోణి వైకుంఠం"  అంటే శ్రీ మహావిష్ణు మూర్తులు మూడు, మూడు రకములుగా స్థాపించబడిన క్షేత్రం అని అర్ధం.
ఆ మూడు రకములు
  1. స్వయంభు - స్వామివారు భక్తుని కొరకు తనకు తానుగా వెలయటం 
  2. ఆరుషం - మహాభక్తుడయిన మహర్షి స్వామివారి అర్చామూర్తిని నెలకొల్పటం 
  3. పురాణ సిద్ధం - పురాణములలో ప్రస్తావించిన ఒక సంఘటనకు సంబందించిన మూర్తి నెలకొని ఉండటం
ఈ మూడు రకముల మూర్తులు కలిగి ఉన్న క్షేత్రమును "త్రిలింగ క్షోణి వైకుంఠం"  అని పిలువ వచ్చు.

ఇటువంటి అధ్బుతమైన ప్రత్యేకత కలిగిన దేవాలయం మనకు అత్యంత చేరువలో తూర్పుగోదావరి జిల్లలో ఉన్నది. అదే కాకినాడకు సమీపంలోని సర్పవరం లోని భావ నారాయణ దేవాలయం
ఈ సర్పవరం లో ఉన్న ముగ్గురు విష్ణుమూర్తులు ఇలా ఉన్నాయి. 
  1. స్వయంభు - పాతాళ భావనారాయణ 
  2. ఆరుషం - రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ - నారద ప్రతిష్ట 
  3. పురాణ సిద్ధం - మూల భావనారాయణ -  అనంత ప్రతిష్ట 
ఈ సర్పవరమునకు చేరుకోవటానికి సామర్లకోట నుండి ఆటో సౌకర్యం ఉన్నది. కాకినాడనుండి సర్పవరం జంక్షన్ నుండి ఆటో సౌకర్యం ఉంటుంది. ఒకవేళ బస్సునందు రా దలచుకొంటే, కాకినాడనుండి సామర్లకోట వెళ్ళే దారిలో మాధవపట్నం అనే స్టాప్ దగ్గర బస్సుదిగి దాదాపుగా 1 కిలోమీటర్ నడవ వలసి ఉంటుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి