21, జనవరి 2016, గురువారం

సర్పపురం - సర్పవరం

అరిషట్ వర్గములలో భాగములయిన క్రోధం, మదం వలన తనకొడుకులను తనే చావమని శపించింది కద్రువ. కొడుకులు చేసిన తప్పు తల్లి చేయమని చెప్పిన తప్పును చేయము అని చెప్పటం. జరిగిన సంఘటన ఆమె పుత్రులను కలచి వేసింది. వారిలో ముఖ్యుడు అనంతుడు.
అనంతుడు కలత హృదయంతో ఇంటిని విడచి పుణ్య స్థలములు వెతుక్కుంటూ తిరిగాడు. అన్ని తీర్దములలో స్నానం చేసాడు. కానీ అతనికి స్వాంతన దొరకలేదు. చివరకు అరణ్యంలో ఒకచోట తపస్సును ఆరంభించాడు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ మహా విష్ణువు అనంతునికి తనకు పడకగా ఉండే భాగ్యం కలుగ చేసాడు. తన భాగ్యమునకు సంతోషించిన అనంతుడు తాను తపస్సు చేసిన ఆ స్థలంలో నారాయణుని ప్రతిష్టించాడు. ఈ నారాయణుని పేరు మూల భావ నారాయణ. ఆది సర్పం (ఆదిశేషుడు/ అనంతుడు) తపస్సు చేసిన, నివశించిన ప్రదేశం కనుక ఈ స్థలమునకు సర్పపురం అని పేరు వచ్చింది. కాల క్రమేణా సర్పవరం గా మారింది.
ఈ వివరం మనకు పురాణములలో కనిపిస్తుంది కనుక ఈ అనంత ప్రతిష్ట నారాయణుని "త్రిలింగ క్షోణి వైకుంఠం" లో చెప్ప బడే పురాణ ప్రతిష్ట గా చెప్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి