22, జనవరి 2016, శుక్రవారం

పాతాళ భావనారాయణుడు

"త్రిలింగ క్షోణి వైకుంఠం" గా చెప్పబడే సర్పవరంలో వెలసిన శ్రీ పాతాళ భావనారాయణుడు అమిత దయా మూర్తి. ఎలాగంటే ..
నిజంగా ఆర్తితో పిలిస్తే భార్య కొంగు పట్టుకున్నానని ధ్యాసకూడా లేకుండా పరుగెత్తుకు వచ్చే శ్రీమన్నారాయణుడు, భక్త సులభుడు కదా! అందుకే తన మాయలో చిక్కుకున్న నారదుని రక్షించటానికి ఒక సామాన్య బ్రాహ్మణునిగా వచ్చాడు. కించిత్ జ్ఞానం వచ్చిన నారదుని వదలి వెళ్లి, అతను ఏమి చేస్తాడా అని చూసి ఉంటారు. నారదుడు పాపం తపస్సు మొదలు పెట్టారని, హడావిడిగా వచ్చేశారు పాపం శ్రీవారు. నారదుని కోసం బయలుదేరగానే గరుడుని అధిరోహించి, పాతాళం నుండి పైకి వచ్చారు కానీ పాపం గరుడునికి పూర్తిగా పైకి వచ్చే అవకాశం ఇవ్వలేదు పాతాళ భావనారాయణుడు. ఇప్పటికీ సర్పవరంలోని పాతాళ భావనారాయణుని చూసి నప్పుడు మనకు గరుడునిపై అధిరోహించిన స్వామి దర్శనం ఇస్తారు. కానీ గరుడుని తల మరియు రెక్కలు మాత్రమే దర్సనం ఇస్తాయి. అతని శరీరం మరియూ కాళ్ళు పాతాళంలోనే ఉన్నాయి. ఈ పాతాళ భావనారాయణుని దర్సిన్చుకోవటానికి మనం భూతలమునకు దాదాపు 4/5 అడుగులు క్రిందకు వెళ్ళవలసి ఉంటుంది.   వారి పాదముల వద్ద నారదుని చూడవచ్చు.
పైన చూపించిన పెయింటింగ్ శ్రీ పాతాళ భావనారయణుని ద్వారం పైన ఉన్నది. ఇక్కడ గరుడుని, శ్రీ స్వామివారి ముఖములు చూడవచ్చు.
స్వామివారు నాలుగు భుజములతో ఉన్నారు. శంఖ, చక్ర, గద మరియు అభయ ముద్రలు దాల్చి ఉన్నారు. నారదునికి స్వామి సాక్షాత్కారం ఇచ్చిన తరువాత నారదుడు సకల భూభాగం తిరిగి ఇటువంటి మరొక మూర్తి ఎక్కడయినా ఉంటుందేమో అని వెతికారట. కానీ వారికి ఈ ప్రదేశంలో తప్ప మరెక్కడా ఇటువంటి మూర్తి కనిపించలేదట. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి