26, అక్టోబర్ 2014, ఆదివారం

ఏకాదశ నీలలోహిత రుద్రులు - భార్యలు - స్థానములు

బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలుపెట్టి, మొట్ట మొదట నలుగురు పుత్రులను సృష్టించాడు.

  1. సనకుడు 
  2. సననందనుడు 
  3. సనత్కుమారుడు 
  4. సనత్ సుజాతుడు 
వారిని సృష్టి కార్యం సహాయం చేయమని చెప్పగా, వారు ఆ కార్యం చేయుటకు తమ అనంగీకారం తెలుపగా, బ్రహ్మదేవునికి కోపం వచ్చినది. కానీ తనకు గల శక్తితో ఆ కోపమును నియంత్రించుకొనెను. కానీ ఆ కోపం బ్రహ్మదేవుని నొసటి భాగం నుండి ఒక పుత్రుని రూపంలో బయటకు వచ్చాడు. క్రోధం కారణం గా జన్మించుట చేత, అతను నల్లగా ఉన్నాడు. పుట్టీ పుట్టగానే, ఏడ్చుట మొదలు పెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అయిన బ్రహ్మదేవుడు అడుగగా, తన పేరు ఏంటి? తను ఎక్కడ ఉండాలి? అని అడిగాడు. పుట్టుకతోనే ఏడ్చాడు కనుక అతనికి రుద్రుడు అని పేరు పెట్టారు. నలుపు ఎరుపు కలిగిన రూపం కలిగి ఉన్నాడు కనుక నీలలోహితుడు అని అన్నారు. 
  1. మన్యువు - ధీర - చంద్రుడు 
  2. మనువు - వృత్తి - సూర్యుడు 
  3. మహాకాలుడు - అశన - అగ్ని 
  4. మహశ్చివుడు - ఉమ - వాయువు 
  5. ఋతధ్వజుడు - నియతి - జలము 
  6. ఉరురేతుడు - సర్పి - ఆకాశము 
  7. భవుడు - ఇల - భూమి 
  8. కాలుడు - అంబిక - ప్రాణములు 
  9. వామదేవుడు - ఇరావతి - తపస్సు 
  10. ధృతవ్రతుడు - సుధ - హృదయం 
  11. నీలలోహితుడు - దీక్ష - ఇంద్రియములు 
తనకి పేర్లు, భార్యలు, నివాస స్థానములు నిర్ణయించిన మీదట, సృష్టి కార్యం చేయమని చెప్పగా, నీలలోహితుడు అలాగే చేసాడు. కానీ అతని వలన కలిగిన సంతానం తమోగుణం కలిగిన వారు అయినారు కనుక ఈ సృష్టికి విపత్తు ఏర్పడినది. అప్పుడు మరలా బ్ర్హమదేవుడు వారిని తపస్సు చేయమని అడిగారు. వారు అలాగే అని తపస్సు చేసారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి