సుకాలినులు అనే పితృ దేవతలు మూర్తగణములు. వీరు ద్యులోకం పైన నక్షత్రకాంతిలో ప్రకాశించు జ్యోతిర్భాసి అనే లోకంలో నివసిస్తారు. వీరి తండ్రి గారు వశిష్ఠుడు. వీరిని శ్రాద్ధకాలంలో బ్రాహ్మణులు పూజిస్తారు. వీరి మానస పుత్రి పేరు గౌ:
Deepika's neerajanam is discussing about the ideas of hindu mythology concepts and its inner meanings, puranams, itihasams, historical concepts, prabaandhamulu, sanskrit, telugu kavyams, telugu padyamulu, neeti kadhalu, intresting concepts and their symbolisms, predictions, interpretations aand many more knowledge filled posts.
27, జూన్ 2019, గురువారం
సుకాలినులు
లేబుళ్లు:
పితృ దేవతలు,
మత్స్య పురాణం
25, జూన్ 2019, మంగళవారం
ఆజ్యపులు
ఆజ్యపులు అనే పితృగణములు మూర్తగణములు . వీరు పులహుని పుత్రులు కొందరు, కర్దమ ప్రజాపతి పుత్రులు కొందరు. వీరు నివసించు లోకము సర్వ కామనాలు చక్కగా తీర్చే కామదుఘాము అనే లోకము. వీరిని శ్రాధ సమయములో వైస్యులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు విరజ. ఈమె నహుషునికి భార్య, మహారాజు యయాతి కి తల్లి.
లేబుళ్లు:
పితృ దేవతలు,
మత్స్య పురాణము
23, జూన్ 2019, ఆదివారం
హవిష్మంతులు
హవిష్మంతులు అనే పేరుగల పితృగణము మూర్తగణము. వీరి తండ్రి అంగీర: ప్రజాపతి. వీరు నివసించు లోకము సూర్యమండలములో గల మరీచి గర్భములు, అంటే లోపలవైపునకు కూడా కిరణములు కలవి అని అర్ధము కలిగిన లోకములు. వీరిని శ్రాద్ధములు జరిపించు క్షత్రియులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు యశోద.
ఆమె సూర్యవంశమునకు చెందిన అంశుమంతుడు అనే రాజునూ వివాహం చేసుకున్నది. వారికి జన్మించిన పుత్రుడు దిలీపుడు. దిలీపుని పుత్రుడు భగీరధుడు. సాక్షాత్తు ఆకాశగంగను భూమి మీదకు తెచ్చినది ఇతనే.
ఆమె సూర్యవంశమునకు చెందిన అంశుమంతుడు అనే రాజునూ వివాహం చేసుకున్నది. వారికి జన్మించిన పుత్రుడు దిలీపుడు. దిలీపుని పుత్రుడు భగీరధుడు. సాక్షాత్తు ఆకాశగంగను భూమి మీదకు తెచ్చినది ఇతనే.
లేబుళ్లు:
పితృదేవతలు,
మత్స్య పురాణం
21, జూన్ 2019, శుక్రవారం
సోమపులు
మనం ఇంతకు ముందు 7గురు పితృ దేవతల పేర్లు వారిలో ఆమూర్తగణముల గురించి తెలుసుకున్నాం కదా! ఇపుడు మూర్త గణముల గురించి తెలుసుకుందాం! వారిలో మొదటి గణము సోమపులు.
వీరు స్వధాకారము నుండి జన్మించారు. వీరు బ్రహ్మ లోకములోని మానసములు అనే లోకములో నివసిస్తారు. వీరు అనంతమయిన యోగ సిద్ధి చేత బ్రహ్మత్వము పొందారు. వీరి పుత్రిక పేరు నర్మద, ఈమె సకల జలములకు ప్రతీక.
ఈ సోమపులు సకల పితృదేవతల కు ప్రతీకలు కనుకనే శ్రాద్ధము చేసే తప్పుడు స్వధాకారం చెప్తారు మరియు జలముల దగ్గర తర్పణములు చేస్తారు.
వీరు స్వధాకారము నుండి జన్మించారు. వీరు బ్రహ్మ లోకములోని మానసములు అనే లోకములో నివసిస్తారు. వీరు అనంతమయిన యోగ సిద్ధి చేత బ్రహ్మత్వము పొందారు. వీరి పుత్రిక పేరు నర్మద, ఈమె సకల జలములకు ప్రతీక.
ఈ సోమపులు సకల పితృదేవతల కు ప్రతీకలు కనుకనే శ్రాద్ధము చేసే తప్పుడు స్వధాకారం చెప్తారు మరియు జలముల దగ్గర తర్పణములు చేస్తారు.
లేబుళ్లు:
పితృదేవతలు,
మత్స్య పురాణము
19, జూన్ 2019, బుధవారం
బర్హిషదులు
ఈ పితృగణము అమూర్త గణము. వీరి తండ్రి పులస్త్యుడు.వీరు నివసించు లోకము ధ్యు లోకంలోనే కాంతివంతములయిన మరికొన్ని లోకములు, విభ్రాజములు.
వీరిని అసుర, దానవ , గంధర్వ, అప్సరస యక్షులు, ధ్యు లోకములోని దేవతలు అందరూ ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు పీవరి. ఆమె యోగులకే యోగిని అనే చెప్తారు.
వీరిని అసుర, దానవ , గంధర్వ, అప్సరస యక్షులు, ధ్యు లోకములోని దేవతలు అందరూ ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు పీవరి. ఆమె యోగులకే యోగిని అనే చెప్తారు.
లేబుళ్లు:
పితృ దేవతలు,
మత్స్య పురాణము
17, జూన్ 2019, సోమవారం
అగ్నిష్వాత్తులు
అగ్నిష్వాత్తులు అనే పితృగణము అమూర్త గణము. వీరి తండ్రి మరీచి, వీరు నివసించు లోకము సోమ పధము. వీరు అగ్నియందు అనేకములయిన హవిస్సులు వేసి యజ్ఞములు చేశారు కనుక వీరికి ఈ పేరు వచ్చింది. వీరిని సకల దేవతలు ఆరాధిస్తారు.
వీరి పుత్రిక పేరు : ఆచ్చోదా, అమావాస్య
వీరి పుత్రిక పేరు : ఆచ్చోదా, అమావాస్య
లేబుళ్లు:
పితృ దేవతలు,
మత్స్య పురాణము
15, జూన్ 2019, శనివారం
వైరాజులు
పితృదేవతలలో ఆమూర్తి గణములలో మొదటి వారు వైరాజులు. వారి తండ్రి పేరు విరాజుడు. వీరు నివసించు లోకము ద్యు లోకము. వీరిని మానవ దేవతా భేదం లేకుండా అందరూ ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు మేన దేవి.ఈమె ఒకానొక శాపం కారణంగా భూలోకమునకు రావలసి వచ్చి, హిమవంతుడిని వివాహం చేసుకున్నది. ఆ తరువాత ఆమె పార్వతిదేవికి తల్లి అయినది.
లేబుళ్లు:
పితృ దేవతలు,
మత్స్య పురాణం
13, జూన్ 2019, గురువారం
పితృ దేవతలు - సత్యవతి
ఇంతకు ముందు మనం పితృ దేవతలు , వారి పుత్రిక అమావస్య గా ఎందుకు పిలవ బడుతుంది అని తెలుసుకున్నాం కదా !
ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఆమెకు పితృదేవతలు ఇచ్చిన శాపం గురించి కూడా తెలుసుకున్నాం! ఆమెను భూలోకంలో మానవజన్మ నెత్తమని వారి శాపం. వారి శాపమును విన్న అమావస్య అత్యంత బాధకు, పశ్చాతాపమునకు లోనయ్యి ఆ శాపమునకు కలుగు ఉపశమనమును తెలుపమని కోరినది. భూత భవిష్య వర్తమాన కాలములను తెలుసుకొనగలిగిన ఆ పితృ దేవతలు ఆమెకు జరుగబోయే విషయములను చక్కగా వివరించారు.
ఆమె 28వ ద్వాపరయుగములో ఒక దివ్య పురుషునకు జన్మనివ్వవలసి ఉన్నది. అతను మాత్రమే తరువాత వచ్చు అనేక అల్పబుద్ధి, అల్ప ఆయుష్షు కల్గిన మానవులను కాపాడే విధంగా వేదములను విభాగం చేయగలడు. అయితే అతని జననం వలన ఆమె కన్యత్వం చెడదు. ఆ తరువాత ఆమె సముద్ర అంశతో జన్మించిన శంతనుడు అనే ఒక మహారాజును వివాహం చేసుకుంటుంది.
తెలిసింది కదా ఆమె ఎవరో! ఆమే మత్స్య గంధి, యోజన గంధి అని పిలువ బడే సత్యవతి.
ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఆమెకు పితృదేవతలు ఇచ్చిన శాపం గురించి కూడా తెలుసుకున్నాం! ఆమెను భూలోకంలో మానవజన్మ నెత్తమని వారి శాపం. వారి శాపమును విన్న అమావస్య అత్యంత బాధకు, పశ్చాతాపమునకు లోనయ్యి ఆ శాపమునకు కలుగు ఉపశమనమును తెలుపమని కోరినది. భూత భవిష్య వర్తమాన కాలములను తెలుసుకొనగలిగిన ఆ పితృ దేవతలు ఆమెకు జరుగబోయే విషయములను చక్కగా వివరించారు.
ఆమె 28వ ద్వాపరయుగములో ఒక దివ్య పురుషునకు జన్మనివ్వవలసి ఉన్నది. అతను మాత్రమే తరువాత వచ్చు అనేక అల్పబుద్ధి, అల్ప ఆయుష్షు కల్గిన మానవులను కాపాడే విధంగా వేదములను విభాగం చేయగలడు. అయితే అతని జననం వలన ఆమె కన్యత్వం చెడదు. ఆ తరువాత ఆమె సముద్ర అంశతో జన్మించిన శంతనుడు అనే ఒక మహారాజును వివాహం చేసుకుంటుంది.
తెలిసింది కదా ఆమె ఎవరో! ఆమే మత్స్య గంధి, యోజన గంధి అని పిలువ బడే సత్యవతి.
లేబుళ్లు:
పితృ దేవతలు,
మత్స్య పురాణం
11, జూన్ 2019, మంగళవారం
పితృ దేవతలకు అమావస్య తిధి ఎందుకు ఇష్టమంటే ...!
మనం ఇంతకు ముందు పితృదేవతలు 7 గణములని వారి పేర్లు చెప్పుకున్నాం కదా! వారిలో అగ్నిష్వాత్తులు అనే పితృదేవతలకు ఆచ్చోదా అనే మానస పుత్రిక ఉన్నది. ఆమె ఒక వెయ్యి దివ్య సంవత్సరములు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన పితరులు సంతుష్టులై ఆమెను వరం కోరుకొమ్మని అడిగారు. అయితే వచ్చిన ఆ పితృదేవతలలో మావసుడు అనే వానిని ఆమె వరించింది. ఆమె చేసిన ఈ ధర్మ దూరమయిన పనికి ఆ పితృ దేవతలు ఆమెను భూలోకములో జన్మించమని శపించారు.
అయితే ఆ మావసుడు ఆమెను పుత్రికా దృష్టితో చూసినందువలన ఆమె మావాస్య కాలేదు. అంటే ఆమె అమావాస్య అయినది. ఆమె చేసిన తపస్సును పితృదేవతలు మెచ్చారు కనుక అమావస్య తిధి రోజు పితరులకు అర్పించినది ఏదయినా అక్షయము అవుతుంది.
అయితే ఆ మావసుడు ఆమెను పుత్రికా దృష్టితో చూసినందువలన ఆమె మావాస్య కాలేదు. అంటే ఆమె అమావాస్య అయినది. ఆమె చేసిన తపస్సును పితృదేవతలు మెచ్చారు కనుక అమావస్య తిధి రోజు పితరులకు అర్పించినది ఏదయినా అక్షయము అవుతుంది.
లేబుళ్లు:
పితృదేవతలు,
మత్స్య పురాణం
9, జూన్ 2019, ఆదివారం
పితరులు
శ్రాద్ధము మొదలయిన కర్మలలో మనకు తరచుగా వినిపించే పేరు పితృదేవతలు. అయితే వారు ఎవరు? దీనికి సమాధానము హరివంశములో చెప్పారు.
దీనికి అర్ధం : రూపము కలిగిన వారును, రూపము లేనివారూ, అత్యంత ప్రకాశవంతమయిన తేజస్సు కలిగినవారు, యోగ శక్తి సంపన్నమయిన కన్నులతో, ధ్యానము ద్వారా అన్ని విషయములగురించి తెలుసుకోగలిగినవారు , అటువంటి యోగ చక్షువులు కలిగినవారి చే ధ్యానింప బడే వారు అయిన పితృ దేవతలకు సదా నమస్కరింతును.
అంటేఅనేక గణములుగా ఉన్న పితరులతో కొందరికి రూపములు ఉన్నాయి మరి కొందరికి లేవు. మొత్తం పితర గణములు 7. వానిలో
అమూర్త గణములు : రూపములు లేని వారు
అమూర్తానాంచ ముర్తానాం పితౄణం దీప్తతేజసం
నమష్యామి సదాతేషాం ధ్యాయినాం యోగ చక్షుషా !
అంటేఅనేక గణములుగా ఉన్న పితరులతో కొందరికి రూపములు ఉన్నాయి మరి కొందరికి లేవు. మొత్తం పితర గణములు 7. వానిలో
అమూర్త గణములు : రూపములు లేని వారు
మూర్త గణములు : రూపములు ఉన్నవారు
లేబుళ్లు:
మత్స్య పురాణము,
హరి వంశము
9, మే 2019, గురువారం
రామాయణం - ఒక భక్తుని జీవితం
మనం ఇంతకూ ముందు రామాయణం గురించి అనేక విషయములు చెప్పుకున్నాం! రామాయణంలోని వివిధ సంఘటనలను మానవుని దేహంలోని ఏడు చక్రములతో ఎలా పోల్చారో, రామాయణమునకు ఉన్న ఆధ్యాత్మిక అర్ధం ఏమిటో, రామాయణమును కల్పవృక్షం, వేదం మరియు గాయత్రీ మంత్రములతో ఎలా పోల్చాలో చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మహా రామ భక్తుడు అయిన తులసీదాసు రామాయణంలోని ఏడు కాండలను ఒక భక్తుని జీవితంలో రామభక్తిలో చేరుకునే అనేక సోపానములతో పోల్చారు. అవి ఏంటో చూద్దామా!
- బాల కాండ - సుఖ సంపాదన సోపానం
- అయోధ్య కాండ - ప్రేమవైరాగ్య సంపాదన సోపానం
- అరణ్య కాండ - విమల వైరాగ్య సంపాదన సోపానం
- కిష్కింద కాండ - విశుద్ధ సంతోష సంపాదన సోపానం
- సుందర కాండ - జ్ఞాన సంపాదన సోపానం
- యుద్ధ కాండ - విజ్ఞాన సంపాదన సోపానం
- ఉత్తర కాండ - అవిరళ హరిభక్త సంపాదన సోపానం
6, మే 2019, సోమవారం
రామాయణం - 7 చక్రములు
మనం ఇంతకు ముందు మనం రామాయణం దానిలోని ఆధ్యాత్మిక అర్ధం గురించి చెప్పుకున్నాం కదా! ఆ రామాయణం మానవునిలో ప్రాణశక్తిని మేల్కొలిపి 7 చక్రములను జాగృతం చేసి పరమాత్ముని చేరుకొనే మార్గంలో కలిగే అనేకములయిన అనుభవాలను చెప్తుంది అని పెద్దల వాక్కు. అయితే రామాయణంలో ఏ సంఘటనలు ఆయా చక్రములను సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం!
- మూలాధారం: రామాయణంలో శివధనుర్బంగం జరిగిన సంఘటన ను మూలాధారంగా చెప్తారు. స్థిరత్వమును చేకూర్చే ఈ చక్రమును శ్రీరాముని కళ్యాణముతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది.
- స్వాధిష్టానం: రామాయణంలో కైక అడిగిన రెండు వరముల కారణంగా శ్రీరాముడు వనవాసమునకు వెళ్లే సంఘటనను స్వాధిష్టాన చక్రం గా చెప్తారు. భావావేశములకు మూలమయిన ఈ చక్రమును విపరీతమయిన భావావేశము నిండిన ఈ సంఘటనతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది.
- మణిపుర: వనవాసమునకు వెళ్లిన సీతారాములకు దివ్యమయిన ఆభరణములు పరమ పతివ్రత అయిన అనసూయాదేవి ఇవ్వటం అనే సంఘటనను మణిపుర చక్రంగా చెప్తాము. ఈ ఆభరణములు తరువాతి కధలో అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తాయి. అటువంటి దివ్య మణిమయములయిన ఆభరణములు సీతాదేవికి సంక్రమించే సంఘటనను మణిపుర చక్రంతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది.
- అనాహతం: వనవాసం సజావుగా ఆనందముగా సాగుతున్న సమయములో శూర్పణఖ ప్రవేశించుటను అనాహత చక్రంతో పోల్చారు. సరిగ్గా రామాయణంలో అసురవధ ఈ ఘట్టంతరువాతనే ముఖ్యంగా జరుగుతుంది కనుక అడ్డంకులు తొలగించు అనాహత చక్రం తో ఈ సంఘటనను పోల్చుట సరిగ్గా సరిపోతుంది.
- విశుద్ధి: సీతా వియోగం వలన పరితపిస్తున్న శ్రీరాముడు పరమ శుద్ధ భక్తురాలయిన శబరిని కలిసిన సంఘటనను ఈ విశుద్ధి చక్రంతో పోల్చారు.
- ఆజ్ఞా: రామాయణంలో సుగ్రీవుని ఆజ్ఞతో సీతాదేవిని వానరులు వెతుకుటకు బయలుదేరు సంఘటనను ఆజ్ఞా చక్రం మొదలుగా పోల్చారు. అయితే సహజంగా ఈ చక్రం వరకు చేరిన ప్రాణమునకు దివ్య దర్శనం జరుగుతుంది. మరి రామాయణంలో జరిగిన ఆ క్షణకాల దివ్య దర్శనం ఎం అయ్యి ఉంటుంది? దీనికి సమాధానంగా మన పెద్దలు కిష్కిందకాండలో సీతను వెతుకుతూ వెళ్లిన హనుమంతుడు మొదలగు వారికి కలిగిన ఒక అనుభవాన్ని చెప్తారు. సూర్యప్రభాదేవి . అనుకోకుండా ఒక కొండా గుహలో బందీలయిన వానర వీరులను సూర్యప్రభాదేవి ఒక్క క్షణకాలంలో సముద్ర తీరమునకు చేర్చుతుంది.
- సహస్త్రారం: ఈ చక్రం మానవుని దైవత్వమునకు దగ్గర చేస్తుంది అని చెప్పుకున్నాం కదా! రామాయణంలో శ్రీరామ పట్టాభిషేకం ఘట్టమును ఈ చక్రముతో పోల్చారు.
లేబుళ్లు:
7 చక్రములు,
రామాయణం,
విశ్లేషణ
3, మే 2019, శుక్రవారం
మానవుని దేహంలో 7 చక్రములు
మానవుని దేహంలో 7 చక్రములు ఉంటాయి. ఆ చక్రములను జాగృతం చేస్తే మానవుని మేధస్సు నిరుపమానంగా వృద్ధి చెందుతుంది. మరి ఆ చక్రములు ఏవో చెప్పుకుందాం!
- మూలాధారం : పేరు లో చెప్పినట్లు ఏది మూలమునకు ఆధారంగా ఉంటుంది. మానవుని దేహములో ఈ చక్రం వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది. ఈ చక్రంలో భూ తత్త్వం ఉంటుంది. సహజంగా ఈ చక్రము ఎరుపు రంగు కలిగి నాలుగు పత్రములు కల్గిన చక్రంగా చెప్తారు. ఈ చక్రం మానవుని దేహంలో స్థిరత్వమును కలిగిస్తుంది
- స్వాధిష్టానం: ఈ పేరుకు అర్ధం స్వ - అధిష్టానం. మానవుని శరీరంలో ఈ చక్రం పొత్తికడుపు భాగం లో ఉంటుంది. ఈ చక్రం జలతత్వం కలిగి ఉంటుంది. సహజంగా ఈ చక్రం నారింజరంగు కలిగిన ఆరు పత్రములు కలిగి ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో భావావేశములు మరియు కోరికల కు నియంత్రిస్తుంటుంది.
- మణిపుర: దీనికి అర్ధం మణుల పురము అని. మానవుని దేహంలో ఈ చక్రం బొడ్డు భాగంలో ఉంటుంది. ఈ చక్రం అగ్నితత్వం కలిగి ఉంటుంది. సహజంగా ఈ చక్రం ఎరుపు రంగులో త్రికోణంగా ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో ఆహారము జీర్ణ క్రియను నియంత్రిస్తుంది.
- అనాహతం: ఈ పేరుకు అర్ధం అనా- హతం, అడ్డంకులు లేనిది. మానవుని దేహంలో ఈ చక్రం హృదయస్థానంలో ఉంటుంది. ఇది వాయు తత్త్వం కలిగి ఉంటుంది. ఈ చక్రం ఆకుపచ్చ రంగులో మధ్య షట్కోణం దానిచుట్టూ 12 కమల దళములు కలిగి ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో జాగృతం అవుట వలన తమపర భేదం లేని అవ్యాజమైన ప్రేమ మూర్తులు గ ఉంటారు.
- విశుద్ధి: ఈ పేరుకు అర్ధం పరిశుభ్రం చేయునది అని. మానవుని దేహంలో ఈ చక్రం కంఠ భాగంలో ఉంటుంది. ఈ చక్రం ఆకాశ తత్త్వం కలిగి ఉంటుంది. ఈ చక్రం నీలం రంగు కలిగి తలక్రిందులుగా ఉన్న త్రిభుజం దానిచుట్టూ 16 వంకాయరంగు దళములు కలిగిన పద్మముగా ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో జాగృతం అవుట వలన నిస్సందేహంగా నిజములను చెప్పగలుగుతారు. వారి మనోభావాలను సూటిగా చెప్పగలుగుతారు.
- ఆజ్ఞా: ఈ పేరుకు అర్ధం స్వాధికారత. మానవుని దేహంలో ఈ చక్రం కనుబొమల మధ్య ఉంటుంది. ఈ చక్రానికి ఏవిధమయిన తత్త్వం ఉండదు. ఈ చక్రం పారదర్శికం గా ఉన్న కమలం దానిలో రెండు తెలుపు దళములతో ఉంటుంది. ఈ చక్రం జాగృతం అవుట వలన మానవునికి తనగురించి తనకు పూర్తిగా తెలుస్తుంది, భౌతిక విషయములకు మించి అనేక విషయముల జ్ఞానం కలుగుతుంది.
- సహస్త్రారం: ఈ పేరుకు అర్ధం వేయి దళముల పద్మం. మానవుని దేహంలో ఈ చక్రం మాడు పైభాగం లో ఉంటుంది. ఈ చక్రము ఏ విధమయిన భౌతిక ధాతువుల తత్వమూ కలిగి ఉండదు. ఈ చక్రం వేయిదళముల పద్మం, ఈ పద్మం చుట్టూ లేత గులాబీరంగు కంటి ఉంటుంది. ఈ చక్రం మానవుని దైవత్వమునకు దగ్గర చేస్తుంది.
30, ఏప్రిల్ 2019, మంగళవారం
పాండవులు - ఇంద్రుడు
మహాభరతం లో ఎన్ని సార్లు ఎంతమంది సమాధానాలు చెప్పినా మల్లి మల్లి అందరు అడిగే ప్రశ్న ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండుట ధర్మమేనా?
ఈ ప్రశ్నకు మహాభారతంలో అనేక సందర్భములలో అనేక వృత్తాంతములతో ఇది ధర్మమే అని చెప్పారు. ఆ వృత్తాంతములు చెప్పే ముందు అసలు పంచ పాండవులు ఎవరు? ద్రౌపది ఎవరు అని ముందుగా చూద్దాం!
ద్రౌపది - స్వర్గ లక్ష్మి
ధర్మరాజు - యమధర్మ రాజు అంశ
భీముడు - వాయుదేవుని అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశ
ఇలా పాండవులు వివిధ దేవతల అంశాలుగా చెప్పబడినా , వారిలో నుండి బయటకు వచ్చిన ఆయా అంశలు కూడా ఇంద్రుని అంశలే అని ద్రౌపది కల్యాణ సమయంలో స్వయంగా వ్యాసుడు ద్రుపదునికి చెప్పాడు.
ఇదే కథను మార్కండేయ పురాణంలో మరోవిధంగా చెప్పారు. ఆ కదా ప్రకారం :
ధర్మరాజు - యమధర్మ రాజు అంశ గా వచ్చిన ఇంద్ర అంశ
భీముడు - వాయుదేవుని అంశగా వచ్చిన ఇంద్ర అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశగా వచ్చిన ఇంద్ర అంశ
ఈ ప్రశ్నకు మహాభారతంలో అనేక సందర్భములలో అనేక వృత్తాంతములతో ఇది ధర్మమే అని చెప్పారు. ఆ వృత్తాంతములు చెప్పే ముందు అసలు పంచ పాండవులు ఎవరు? ద్రౌపది ఎవరు అని ముందుగా చూద్దాం!
ద్రౌపది - స్వర్గ లక్ష్మి
ధర్మరాజు - యమధర్మ రాజు అంశ
భీముడు - వాయుదేవుని అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశ
ఇలా పాండవులు వివిధ దేవతల అంశాలుగా చెప్పబడినా , వారిలో నుండి బయటకు వచ్చిన ఆయా అంశలు కూడా ఇంద్రుని అంశలే అని ద్రౌపది కల్యాణ సమయంలో స్వయంగా వ్యాసుడు ద్రుపదునికి చెప్పాడు.
ఇదే కథను మార్కండేయ పురాణంలో మరోవిధంగా చెప్పారు. ఆ కదా ప్రకారం :
ఇంద్రుడు దేవతల రాజు. అత్యంత ధర్మవంతునిగా ఉండవలసిన భాద్యత అతనిది. కానీ ఆ విధంగా చేయవలసిన అనేక సందర్భములలో కొన్నిసార్లు అధర్మం చేయవలసి వచ్చింది. అలా అధర్మం చేసినప్పుడు అతనిలోని కొంత శక్తి కోల్పోతూ వచ్చాడు. అయితే అతను కోల్పోయిన ఆ శక్తి ఆయా సందర్భములలో అతనిని ఉద్దరించటానికి సహాయం చేసిన దేవతలకు ఆ శక్తి అంశలుగా చేరాయి. మరి ఇంద్రుడు ఏ పనులు చేసాడు, ఆలా చేసినప్పుడు అంశ ఏ దేవతలను చేరిందో తెలుసుకుందాం!
అహల్యా వృత్తాంతం : గౌతమ ముని శాపం తర్వాత అత్యంత జుగుప్సాకరంగా మారిన అతని శరీరమును తిరిగి పూర్వ రూపం వచ్చేలా ప్రయత్నించిన వారు దేవా వైద్యులయిన అశ్విని దేవతలు. కనుక ఇంద్రుడు ఆ సమయంలో కోల్పోయిన శక్తి ఈ సందర్భంలో అశ్వినీ దేవతలకు సంక్రమించింది.
వృత్రాసుర వధ : వృత్రాసురుని వధ తరువాత అతనికి బ్రహ్మహత్యాపాతకం సంక్రమించింది.
ఆ బ్రహ్మహత్యాపాతకమును కొంత తాను తీసుకున్న వాయుదేవునికి కొంత ఇంద్రతేజస్సు సంక్రమించింది.
త్రిశిరుని వధ : త్రిశిరుడు అనే రాక్షసుని సంహరించిన తరువాత ఆ పాపంలో కొంత పాపం తాను తీసుకుని ఇంద్రునికి సహాయం చేసిన యమునిలో ఇంద్ర అంశ కొంత వచ్చి చేరింది.
కనుక కుంతీ దేవి, మాద్రిదేవి వివిధదేవతలను ఉపాసించి పుత్రులను కోరినప్పుడు ఆయా దేవతలు వారివద్ద ఉన్న ఇంద్రుని అంశలను వారికి పుత్రులుగా ఇచ్చారు కనుక
భీముడు - వాయుదేవుని అంశగా వచ్చిన ఇంద్ర అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశగా వచ్చిన ఇంద్ర అంశ
కనుక అందరు పాండవులు కూడా ఇంద్రుని అంశలే. మరి ఇంద్రుని రాజ్యలక్ష్మి అయిన స్వర్గ లక్ష్మి పాండవుల పట్ట మహిషి అయిన ద్రౌపది గా వచ్చినది.
లేబుళ్లు:
పాండవులు,
మహాభారతం,
మార్కండేయ పురాణం
27, ఏప్రిల్ 2019, శనివారం
వాల్మీకి - ఒక ఆలోచన
ఇది వరకు మనం ఆధ్యాత్మరామాయణం లో శివుడి పార్వతితో చెప్పిన ఒక శ్లోకమును ఆధారముగా చేసుకుని వాల్మీకి ప్రచేతసుల కుమారుడు అని చెప్పుకున్నాం కదా! మరి మనకు తెలిసిన కథ సంగతి ఏమిటి? ఆ విషయం తెలుసుకునే ముందు అసలు మనకు తెలిసిన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం!
అనగనగా ఒక బోయవాడు. వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. వేట దొరకనప్పుడు దారి కాచి బాటసారులను దోచుకుని ధనం సంపాదించేవాడు. ఒకరోజు నారద మునిని అలానే బెదిరించగా తాను చేస్తున్నది పాపం కనుక ఆ పాపంలో వాని కుటుంభం సభ్యులు పాలు పంచుకుంటారేమో అడుగ మని చెప్పగా, బోయవాడు వెళ్లి అందరిని అడుగగా ఎవ్వరూ ఆ పాప భారమును స్వీకరించుటకు సుముఖంగా ఉండకపోవుట చూసి వైరాగ్యము కల్గిన బోయవాడు నారదుని కాళ్లపై పడగా , నారదుడు అతనికి "రామ" మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రము నోరుతిరుగక పోవుట వలన నారదుడు బోయవానికి "మర" అని పలుకమని తరుణోపాయము చెప్పారు. ఆ తారక మంత్రములో నిమగ్నుడయిన అతని చుట్టూ పుట్టలు పట్టాయి. కొన్ని రోజుల తరువాత ఆ పుట్టలోనుండి బయటకు చచ్చాడు కనుక అతనిని వాల్మీకి అని సంభోదించారు.
అయితే ఈ కథలోని కొన్ని భాగాలు కొంచెం ఆలోచిస్తే ప్రక్షిప్తాలేమో అనే అనుమానం తప్పకుండా వస్తుంది.
అనగనగా ఒక బోయవాడు. వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. వేట దొరకనప్పుడు దారి కాచి బాటసారులను దోచుకుని ధనం సంపాదించేవాడు. ఒకరోజు నారద మునిని అలానే బెదిరించగా తాను చేస్తున్నది పాపం కనుక ఆ పాపంలో వాని కుటుంభం సభ్యులు పాలు పంచుకుంటారేమో అడుగ మని చెప్పగా, బోయవాడు వెళ్లి అందరిని అడుగగా ఎవ్వరూ ఆ పాప భారమును స్వీకరించుటకు సుముఖంగా ఉండకపోవుట చూసి వైరాగ్యము కల్గిన బోయవాడు నారదుని కాళ్లపై పడగా , నారదుడు అతనికి "రామ" మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రము నోరుతిరుగక పోవుట వలన నారదుడు బోయవానికి "మర" అని పలుకమని తరుణోపాయము చెప్పారు. ఆ తారక మంత్రములో నిమగ్నుడయిన అతని చుట్టూ పుట్టలు పట్టాయి. కొన్ని రోజుల తరువాత ఆ పుట్టలోనుండి బయటకు చచ్చాడు కనుక అతనిని వాల్మీకి అని సంభోదించారు.
అయితే ఈ కథలోని కొన్ని భాగాలు కొంచెం ఆలోచిస్తే ప్రక్షిప్తాలేమో అనే అనుమానం తప్పకుండా వస్తుంది.
- ఈ కథ జరిగిన కాలం: రామాయణం ప్రకారం వాల్మీకి మహర్షి రామాయణ రచన రాముడు భూమిమీద నడయాడుతున్న కాలంలోనే జరిగింది, అనగా సుమారుగా త్రేతా యుగ చివరి సమయం . అంటే అతను తపస్సు చేసిన కాలం అంతకంటే ముందు అనగా ద్వాపర మధ్య లేక మొదటి భాగం. మరి ఆ కాలంలో దారి దోపిడీ లు జరిగేవా? కొంచెం అనుమానమే కదా!
- కుటుంబ సభ్యులు పాప భారం తీసుకోము అని చెప్పటం: ఆ యుగములలో ఎవరి ధర్మం వారికి ప్రాణప్రదం. ఆ కాలం లో భర్త పాపములో భాగము తీసుకోను అని చెప్పే సందర్భం ఉండే అవకాశం ఉంటుందా?
- మంత్రం: మన సనాతన ధర్మములో ఉన్న అనేక మంత్రముల కంటే అతి చిన్నదయిన, సరళమయిన మంత్రం "రామ", ఈ మంత్రం నోరుతిరుగాక పోవటం, "మర" అనేది నోరు తిరగటం ఎంతవరకు నిజమై ఉండవచ్చు?
25, ఏప్రిల్ 2019, గురువారం
ప్రచేతసులు - వాల్మీకి
ఇది వరకు మనం రామాయణం - వేదం అని ఎలా చెప్పవచ్చు? అనే దాని గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు అదే శ్లోకంలో ఒక విచిత్రమయిన విషయాన్ని గురించి చెప్పుకుందాం!
వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా!
ఈ శ్లోకము ఆధ్యాత్మరామాయణం లోనిది. ఈవిధంగా సాక్షాత్తు శివుడు పార్వతికి చెప్పాడు. ఈ శ్లోకములో రామాయణము వేదమని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నది వాల్మీకి గురించి. ఈ శ్లోకంలో శివుడు వాల్మీకి ని ప్రాచేసా అని సంబోధించారు. అంటే వాల్మీకి ని ప్రచేతసుని కుమారునిగా చెప్పారు. అది ఎలా సాధ్యం?
మనకందరికి తెలిసిన కథ ప్రకారం వాల్మీకి ఒక బోయవాడు. దారి దోపిడీ దొంగ. మరి ఆటను ప్రచేతసుల కుమారునిగా శివుడు ఎందుకు చెప్పారు?
ప్రాచిన బర్హి గారి 10 మంది కుమారులను కలిపి ప్రచేతసులు అంటారు. వారు 10 మందికి ఒకరే భార్య. ఆమె పేరు మారిష. వీరి సంతానములలో మనకు బాగా తెలిసిన వారు దక్షుడు. వారికీ కల్గిన పడవ సంతానమే వాల్మీకి అని చెప్తారు.
మరి వాల్మీకి బోయవాడు కాదా? అనే ప్రశ్నకు సమాధానం తరువాతి టపాలో చూద్దాం!
22, ఏప్రిల్ 2019, సోమవారం
ఇతిహాసము - నిర్వచనము
మనం ఇంతకు ముందు పురాణముల నిర్వచనం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఇతిహాసమునకు నిర్వచనము తెలుసుకుందాం!
ఇతిహాసము : అంటే ఇది ఈవిధముగా జరిగినది అని అర్ధము. దీనిని విపులంగా శ్లోకరూపంలో ఎలా చెప్పారో ఇప్పుడు చూద్దాం!
దీని భావం: ఇదివరకు జరిగిన అనేక సంఘటనలను కధా రూపంలో ధర్మార్ధ కామ మోక్షములను అన్వయించుచూ చెప్పేదే ఇతిహాసం.
ఇతిహాసము : అంటే ఇది ఈవిధముగా జరిగినది అని అర్ధము. దీనిని విపులంగా శ్లోకరూపంలో ఎలా చెప్పారో ఇప్పుడు చూద్దాం!
ధర్మార్ధ కామమోక్షాణాం ఉపదేశ సమన్వితం
పూర్వ వృత్త కధా యుక్త ఇతిహాసం ప్రచక్ష్యసే!
14, ఏప్రిల్ 2019, ఆదివారం
రామాయణము - ఆధ్యాత్మిక అర్ధము
రామాయణము లోని కధ చిన్నపిల్లలకు కూడా చాల బాగా తెలుసు. ఈ కధలోని విశిష్టత పట్టే, కొట్టే , తెచ్చే అను మూడు మాటలలో చెప్పవచ్చు. ఆలా కాకుండా సవిస్తారంగా వర్ణించవచ్చు. సర్వదా ఒక మానవుడు ఏ మార్గంలో చరించాలో చెప్పేది రామాయణం. ఇప్పుడు ఆ కథను మనం క్లుప్తంగా చెప్పుకుందాం! ఆ తర్వాత ఆ కధలో దాగిఉంది అని మన పెద్దలు చెప్పిన ఆధ్యాత్మిక కోణం గురించి తెలుసు కుందాం!
కథ : రాముడు సీత దంపతులు. పదితలలు ఉన్న రావణాసురుడు ఆమెను అపహరించి, సముద్రం అవతల లంకలో దాచివుంచాడు. అప్పుడు రాముడు హనుమంతుని సహాయంతో సీత లంకలో ఉన్నదని గుర్తించి రావణుని సంహరించి సీతను తిరిగి తెచ్చుకున్నాడు.
ఆధ్యాత్మిక అర్ధము: అర్ధము తెలుసుకోవటానికి ముందు ఇంకా కొన్ని విషయములు చూద్దాం!
రాముడు - పరబ్రహ్మ
సీత - జీవాత్మ / జీవరూపిణి
దశకంఠుడు, రావణుడు - దశ ఇంద్రియములు
సముద్రం - సంసారం
లంక - దేహం
హనుమంతుడు - గురువు
పరబ్రహ్మ నుండి జీవాత్మను దశ ఇంద్రియములు దూరం చేస్తాయి. పరబ్రహ్మ కు జీవాత్మకు మధ్య సాగరమే సంసారం మరియు దేహమనే లంకలో జీవాత్మ బంధించ బడింది. జీవాత్మ పరమాత్మను చేరుకోవాలంటే గురువు ప్రమేయం తప్పనిసరిగా అవసరం.
కథ : రాముడు సీత దంపతులు. పదితలలు ఉన్న రావణాసురుడు ఆమెను అపహరించి, సముద్రం అవతల లంకలో దాచివుంచాడు. అప్పుడు రాముడు హనుమంతుని సహాయంతో సీత లంకలో ఉన్నదని గుర్తించి రావణుని సంహరించి సీతను తిరిగి తెచ్చుకున్నాడు.
ఆధ్యాత్మిక అర్ధము: అర్ధము తెలుసుకోవటానికి ముందు ఇంకా కొన్ని విషయములు చూద్దాం!
రాముడు - పరబ్రహ్మ
సీత - జీవాత్మ / జీవరూపిణి
దశకంఠుడు, రావణుడు - దశ ఇంద్రియములు
సముద్రం - సంసారం
లంక - దేహం
హనుమంతుడు - గురువు
పరబ్రహ్మ నుండి జీవాత్మను దశ ఇంద్రియములు దూరం చేస్తాయి. పరబ్రహ్మ కు జీవాత్మకు మధ్య సాగరమే సంసారం మరియు దేహమనే లంకలో జీవాత్మ బంధించ బడింది. జీవాత్మ పరమాత్మను చేరుకోవాలంటే గురువు ప్రమేయం తప్పనిసరిగా అవసరం.
8, ఏప్రిల్ 2019, సోమవారం
రామ, భారత, లక్ష్మణ, శత్రుఘ్న
రాముడు ఈ పేరు వింటే ఒక విధమయిన మానసిక శాంతి లభిస్తుంది కదా! పూర్వకాలంలో నవజాత శిశువులకు పేరు పెట్టవలసిన సందర్భంలో పెద్దలు వారి జాతకమునకు, వారి వ్యవహారమునకు, భవిష్యత్తులో వారు చేయబోయే కార్యములను ముందే సూచిస్తూ పేర్లు పెట్టేవారట. ఒకవేళ వారు పెద్దఅయిన తరువాత ఈ పేరుకు మించి వారు ఘనమైన పనులు చేస్తే వారికి అసలుపేరు కంటే వ్యవహార నామమే ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కుతుంది.
ఉదాహరణకు రావణాసురుని పేరు చూడండి. పుట్టినప్పుడు పెద్దలు ఇతనికి అనేక కళలలో ప్రావీణ్యం ఉంటుంది. అత్యంత మేధాసంపన్నుడు, ఇతను ఒక్కడే పది మంది పుత్రులకు సరిపడు తెలివితేటలు కలవాడు అని "దశగ్రీవుడు" అని పెట్టారు. తీరా ఇతను పెద్ద అయిన తరువాత కైలాసపర్వతం ఎత్తినప్పుడు కలిగిన భాద వలన పెద్దగ రొద పెట్టి, శివుని చేత "రావణా" అని పిలిపించుకున్నాడు. ఇప్పుడు ఎవరిని ఐనా మీకు దశగ్రీవుడు తెలుసా అని అడగండి. గ్రీకు వీరుని తమ్ముడా అని మిమ్మల్నే అడుగుతారు.
అలాగే రామాయణంలో దశరధునికి పుట్టిన నలుగురు పుత్రులకు పేర్లు పెట్టే సమయంలో వారు అన్ని చూసి, వారికి సార్ధక నామదేయములు పెట్టారు. అవి రామ, భారత, లక్ష్మణ, శత్రుఘ్న. ఇంతకీ వారికి ఆ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలంటే కింది పద్యం చూడండి.
గీ. రాముడయ్యెను భువనాభి రాముడగుట
లక్ష్మణుండయ్యె శౌర్యాదిలక్ష్మికతన
భరము దీర్చెడివాడౌట భరతుడయ్యె
దునుమువాడౌట రిపుల శత్రుఘ్నుడయ్యె
ఈ పద్యం శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రిగారు చెప్పిన "శ్రీమదాంధ్ర పద్మ పురాణం" లో పాతాళ ఖండంలో, పూర్వకల్ప రామాయణం లో చెప్పబడినది.
ఉదాహరణకు రావణాసురుని పేరు చూడండి. పుట్టినప్పుడు పెద్దలు ఇతనికి అనేక కళలలో ప్రావీణ్యం ఉంటుంది. అత్యంత మేధాసంపన్నుడు, ఇతను ఒక్కడే పది మంది పుత్రులకు సరిపడు తెలివితేటలు కలవాడు అని "దశగ్రీవుడు" అని పెట్టారు. తీరా ఇతను పెద్ద అయిన తరువాత కైలాసపర్వతం ఎత్తినప్పుడు కలిగిన భాద వలన పెద్దగ రొద పెట్టి, శివుని చేత "రావణా" అని పిలిపించుకున్నాడు. ఇప్పుడు ఎవరిని ఐనా మీకు దశగ్రీవుడు తెలుసా అని అడగండి. గ్రీకు వీరుని తమ్ముడా అని మిమ్మల్నే అడుగుతారు.
అలాగే రామాయణంలో దశరధునికి పుట్టిన నలుగురు పుత్రులకు పేర్లు పెట్టే సమయంలో వారు అన్ని చూసి, వారికి సార్ధక నామదేయములు పెట్టారు. అవి రామ, భారత, లక్ష్మణ, శత్రుఘ్న. ఇంతకీ వారికి ఆ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలంటే కింది పద్యం చూడండి.
గీ. రాముడయ్యెను భువనాభి రాముడగుట
లక్ష్మణుండయ్యె శౌర్యాదిలక్ష్మికతన
భరము దీర్చెడివాడౌట భరతుడయ్యె
దునుమువాడౌట రిపుల శత్రుఘ్నుడయ్యె
ఈ పద్యం శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రిగారు చెప్పిన "శ్రీమదాంధ్ర పద్మ పురాణం" లో పాతాళ ఖండంలో, పూర్వకల్ప రామాయణం లో చెప్పబడినది.
లేబుళ్లు:
పద్మ పురాణం,
రామాయణం
6, ఏప్రిల్ 2019, శనివారం
భరతుడు వంటి సోదరుడు ....
భరతుడు, రామాయణం లోని అనేక వ్యక్తుల చేత అనుమానించబడిన వాడు. దశరధుడు, గుహుడు చివరకు తన సోదరుడయిన లక్ష్మణుడు కూడా అతనిని అనుమానించారు. అటువాని భరతుని గురించి శ్రీ రాముడు ఏమన్నాడో తెలుసా!
అర్హుడే అని వాల్మీకి రామాయణం చెప్తుంది. దానికి కారణం అతని హృదయంలోగల భాతృ భక్తి. దానికి ఈ కింద శ్లోకమే తార్కాణం.
న సర్వే భ్రాతర స్తాత భవంతి భారతోపమాః
అంటే భరతుని వంటి సోదరుడు ఎవరికయినాను లభించుట దుర్లభము అని అర్ధము. మరి శ్రీ రామునితో అంత చక్కగా తనగురించి చెప్పించుకున్న భరతుడు ఎలాంటి వాడు? నిజంగా శ్రీ రామునితో అటువంటి పొగడ్తలకు అర్హుడా?అర్హుడే అని వాల్మీకి రామాయణం చెప్తుంది. దానికి కారణం అతని హృదయంలోగల భాతృ భక్తి. దానికి ఈ కింద శ్లోకమే తార్కాణం.
అభిషేక్ష్యతి రామతు రాజా యజ్ఞంను యజ్ఞంను యక్ష్యతే!
ఇత్యహం కృత సంకల్పో హృష్టో యాత్రా మాయాశిషం!!
తదిదం హ్యన్యధా భూతం వ్యవదీర్ణం మనోరమ !!!
నేను ఏంతో సంతోషంగా తాతగారి ఇంటికి వెళ్ళాను. నేను అటు వెళ్ళగానే తండ్రిగారి అన్నగారయిన శ్రీరాముని రాజుగా ప్రకటించి, పట్టాభిషేకం చేసి ఆ తరువాత యాగాన్ని కూడా జరిపించి ఉంటారని అనుకున్న. ఈ శ్లోకమునకు ఉన్న అర్థమును చూసి మన పెద్దలు భరతుని వ్యక్తిత్వమును చాలా చక్కగా విశ్లేషించారు. భరతుడు ఈ విధంగా అనుకున్నాడు అంటే, అతను శ్రీరామ పట్టాభిషేకం అతని పరోక్షంలో జరగాలని అనుకున్నాడు. అలా ఎందుకు అనుకోని ఉండవచ్చు? 2 కారణములు
- భరతునికి రాజ్యకాంక్ష ఉండి శ్రీరామునికి పట్టాభిషేకం అవుతుంటే చూడలేక !
- భరతునికి దశరధుడు తన తల్లి కైకేయికి వివాహం జరిగిన సమయంలో ఆమె తండ్రికి ఇచ్చిన మాట తెలిసి.
ఈ రెండు సందర్భాలలో మొదటిది అసలు సంభవమే కాదు, ఒకవేళ తాను శ్రీరామ పట్టాభిషేకం చూడలేక అమ్మమ్మగారి ఇంట్లో ఉండగా పట్టాభిషేకం జరిగి పోవాలి అని కోరుకుంటే, అతను తిరిగి వచ్చాక రాజ్యం అకంటకంగా తన పరం అవుతున్నప్పుడు మరలా రామునికోసం అడవులలోనికి పరుగులు పెట్టాడు కదా!
అంటే దీనిని బట్టి మన పెద్దలు ఎలా విశ్లేషించారంటే భరతునికి దశరధుడు తనతల్లికి ఇచ్చిన 2 వరముల గురించి తెలిసిన తెలియక పోయినా, తన తాతగారికి దశరధుడు ఇచ్చిన వాగ్దానం బాగా తెలుసు. దశరధుని రాముని పైన గల ప్రేమ, రామునికి గ రాజ్య పరిపాలనా దక్షత , రాజ్యంలో ప్రజల కు రాముని పై గల ప్రేమ అన్ని తెలుసు. కనుక రాజ్యమును పరిపాలించే అవకాశం తనకు ఉంది తెలిసినా తన అన్నగారికి పట్టాభిషేకం జరగాలి అని కోరుకున్నాడు. మరి అటువంటి భరతుని గురించి రాముడు ఆలా చెప్పటం చాలా సబబే కదా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)