25, ఏప్రిల్ 2019, గురువారం

ప్రచేతసులు - వాల్మీకి

ఇది వరకు మనం రామాయణం - వేదం అని ఎలా చెప్పవచ్చు? అనే దాని గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు అదే శ్లోకంలో ఒక విచిత్రమయిన విషయాన్ని గురించి చెప్పుకుందాం!
వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే 
వేదః ప్రాచేసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా!

ఈ శ్లోకము ఆధ్యాత్మరామాయణం లోనిది. ఈవిధంగా సాక్షాత్తు శివుడు పార్వతికి చెప్పాడు. ఈ శ్లోకములో రామాయణము వేదమని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నది వాల్మీకి గురించి. ఈ శ్లోకంలో శివుడు వాల్మీకి ని ప్రాచేసా అని సంబోధించారు. అంటే వాల్మీకి ని ప్రచేతసుని కుమారునిగా చెప్పారు. అది ఎలా సాధ్యం?

మనకందరికి తెలిసిన కథ ప్రకారం వాల్మీకి ఒక బోయవాడు. దారి దోపిడీ దొంగ. మరి ఆటను ప్రచేతసుల  కుమారునిగా శివుడు ఎందుకు చెప్పారు?

ప్రాచిన బర్హి గారి 10 మంది కుమారులను కలిపి ప్రచేతసులు అంటారు. వారు 10 మందికి ఒకరే భార్య. ఆమె పేరు మారిష. వీరి సంతానములలో మనకు బాగా తెలిసిన వారు దక్షుడు. వారికీ కల్గిన పడవ సంతానమే వాల్మీకి అని చెప్తారు. 

మరి వాల్మీకి బోయవాడు కాదా? అనే ప్రశ్నకు సమాధానం తరువాతి టపాలో చూద్దాం! 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి