13, ఏప్రిల్ 2020, సోమవారం

మహాభారతం - అంశలు

మహాభారతం గురించి ఇంతకు ముందు మనం చాలా విషయాలు చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఆ మహాభారతంలో ఉన్న అనేకమంది వ్యక్తులు ఎవరు ఎవరి అంశలో  పుట్టారో ఇప్పుడు చూద్దాం!

శ్రీ మహావిష్ణువు - శ్రీకృష్ణుడు
ఆదిశేషుడు - బలరాముడు
లక్ష్మి - రుక్మిణి
సనత్కుమారుడు - ప్రద్యుమ్నుడు
అప్సరసలు - 16 వేల మంది శ్రీకృష్ణుని అంతఃపుర స్త్రీలు
ప్రభాసుడు (ఎనిమిదవ మనువు) - దేవవ్రతుడు (భీష్ముడు)
దేవగురువు (బృహస్పతి) - ద్రోణుడు
కామము + క్రోధము - అశ్వద్ధామ
ఏకాదశ రుద్రులు - కృపుడు
సూర్యుడు - కర్ణుడు
ద్వాపరం - శకుని
అరిష్టా పుత్రుడయిన హంసుడు (గంధర్వ) - ధృతరాష్ట్రుడు
మతి  - గాంధారి
కలి - దుర్యోధనుడు
హిరణ్య కశిపుడు - శిశుపాలుడు
సంహ్లాదుడు - శల్యుడు
అనుహ్లాదుండు - దృష్టకేతుడు
శిబి - దుమ్రసేనుడు
భాష్కలుడు - భగదత్తుడు
విప్రచిత్తి - జరాసంధుడు
స్వర్భాను - ఉగ్రసేనుడు
జంబుండు - విశోకుడు
అశ్వపతి - కృతవర్మ
వృషపర్వుడు - దీర్ఘ ప్రజ్ఞుడు
అజరుడు - మల్లుడు
అశ్వగ్రీవుడు - రోచమానుడు
సూక్ష్ముడు - బృహద్రధుడు
దుహుడు - సేనాబిందుడు
ఏక చక్రుడు - ప్రతివింద్యుడు
విరుపాక్షుడు - చిత్రవర్మ
హరుడు - సుబాహు
ఆహరుడు - బాహ్లికుడు
చంద్రవక్త్రుడు - ముంజకేశుడు
నికుంభుడు - దేవాపి
శరభుడు - సోమదత్తుడు
చంద్రుడు - చంద్రవర్మ
అర్కుడు - ఋషికుడు
మయూరుడు - విశ్వుండు
సుపర్ణుడు  - క్రోధకీర్తి
రాహువు - క్రోధుడు
చంద్రహంత - శునకుడు
అశ్వుడు - అశోకుడు
భద్రహస్తుడు - నందుడు
దీర్ఘజిహ్వుడు - కాశీరాజు
చంద్రవినాశనుడు - జానకి
బలీనుడు - పౌండ్ర
వృత్రుడు - మణిమంతుడు
కాలనేమి - కంసుడు
గుహ్యకుడు - శిఖండి
మరుత్గణము - పాండురాజు
మరుత్తులు - ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు
మాండవ్య ముని శాపం వలన యమ ధర్మరాజు - విదురుడు
సిద్ధి - కుంతి
బుద్ధి - మాద్రి
యముడు - ధర్మరాజు
వాయువు - భీముడు
ఇంద్రుడు - అర్జునుడు
అశ్వినీ దేవతలు - నకుల సహదేవులు
స్వర్గ లక్ష్మి - ద్రౌపది
అగ్ని - దృష్టద్యుమ్నుడు 

2 కామెంట్‌లు: