4, ఏప్రిల్ 2019, గురువారం

సీతా రామ వియోగం

శ్రీరామ పట్టాభిషేకం తరువాత జరిగిన సంఘటనల క్రమాన్ని వివరించేది ఉత్తర కాండ. ఆ ఉత్తర కాండ లో ముఖ్యమయిన ఘట్టం సీతా రామ వియోగం. అయితే ఈ సీత రామ వియోగానికి గల కారణాన్ని అనేక పురాణములలో, అనేక కవులు రచించిన రామాయణములలో అనేక రకములుగా చెప్పారు. ఇప్పుడు వాని గురించి తెలుసు కుందాం. 
  1. వాల్మీకి రామాయణం: మనం అన్నింటికన్నా ముందు ముఖ్యంగా చెప్పుకోవలసినది వాల్మీకి రామాయణం గురించే. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో శ్రీరాముడు రాజ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అని వేగులను అడిగినప్పుడు ప్రజల ఆంతర్యములో దానవుడు చెరబత్తిన స్త్రీ తమకు రాణిగా ఉండుట వారికి అంగీకారం కాదు అని అనుకుంటున్నారు అని మాత్రమే వేగులు చెప్పారు. ఆ విషయం విన్న శ్రీరాముడు రాజ్యంలోని ప్రజలకు సీత ఆమోదయోగ్యంగా లేదు కనుక సీతను పరిత్యజించాడు. 
  2. పద్మ పురాణం : పద్మ పురాణం లో ఈ సంఘటన  ఇప్పుడు మనమందరము చెప్పుకుంటున్న రాజకుని నింద  వలన జరిగినది అని చెప్పబడింది. అయితే ఆ రజకుడు కూడా అలా చేయటానికి కారణంగా ఒక కథను చెప్తారు. ఆ కథను ఇక్కడ చదవండి.  
  3. ఆధ్యాత్మ రామాయణం: ఈ రామాయణంలో సీత రాముడు ఏమి చేసినా చక్కాగా ముందే మాట్లాడుకుని వారు అనుకొనిన విధముగా చేస్తారు అని ప్రతిపాదించారు. సీతాపరిత్యాగ విషయముకూడా అంతే. వారు ఏకాంతములో ఉండగా సీతాదేవి దేవతలు తనను ముందుగా వైకుంఠమునకు రమ్మని కోరుతున్నారని చెప్పగా, శ్రీ రాముడు తనకు ముందుగానే ఈ విషయములు అన్ని తెలుసు కనుక దానికి సంబందించిన ప్రణాళిక సిద్దము చేసుకున్నాను అన్ని చెప్పారట. ఆ ప్రణాళిక ప్రకారమే లోక నింద మిషగా సీతను పరిత్యజించి, ఆమె ముని ఆశ్రమములో కుమారులను కనిన తరువాత లోకమునకు తన పాతివ్రత్యమును నిరూపించుకొను మిషతో భూగర్భమునకు తిరిగి చేరుకొనినది. అక్కడి నుండి వైకుంఠమునకు చేరినది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి