7, జూన్ 2016, మంగళవారం

పశువు - మనిషి

పరమ శివుని పశుపతిగా చెప్పినప్పుడు మానవులను పశువులుగా చెప్తారు. అందరూ మానవులకు పశువులకు గల భేదం ఏమిటి అని ఆలోచిస్తారు తప్ప వారి మధ్య ఒకేలా ఉండే గుణములు ఏవి అని ఎందుకు చూడరు? కొందరు చూస్తారు కదా! చాణక్యుని మాటలలో మనిషికి పశువుకు భేదంలేని విషయములు నాలుగు. అవి

ఆహార నిద్రా భయ మైదునాని, సమాని చైతాని నృణాం పశూనాం!
జ్ఞానం న రాణామధికో విశేషో, జ్ఞానేన హీనాః పశుభిః సమానాః !!  
   
భావం : ఆహారం, నిద్ర, భయం మరియు మైధునం అనే నాలుగు మానవులకు పశువులకు సమానం. కానీ మానవులకు విశేషమైన మరో లక్షణం జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానమును వదలేసిన మనిషి కూడా పశువుతో సమానమే!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి