29, మార్చి 2020, ఆదివారం

భారతమును మహాభారతం అని ఎందుకు పిలుస్తారు?

 మనకు 18 పురాణములు, 18 ఉప పురాణములు ఉన్నాయి. వానిలో దేనికి "మహా" అనే సంబోధన మనకు కనిపించదు. కానీ ఒక ఇతిహాసముగా చెప్పబడుతున్న భారతమునకు ఈ విధమయిన సంబోధన కనిపిస్తుంది. మరి ఆ భారతము మహా  భారతం అవటానికి కారణం ఏమి  అయ్యి ఉంటుంది?
దీనికి సమాధానం మనకు మహాభారత తత్వకథనం లో దొరుకుతుంది.

ఏకత శ్చతురో వేదా భారతం చైత దేకత:
పురాకిల సురై స్సర్వై స్సమేత్య తులయా ధృతం

చతుర్భ్య స్సరహాస్యేభ్యో వేదోభ్యో హ్యధికం యదా
తదాప్రభృతి లోకేస్మిన్ మహాభారత ముచ్యతే

మహత్త్వేచ గురుత్వేచ ధ్రియమణం యతో ధికం
మహత్త్వా ద్భారవ త్త్వా చ్చ మహా భారత ముచ్యతే

భావం :  దేవతలు నాలుగు వేదములను భారతమును పరిశీలించి ఏది వీనిలో ఉన్నతమయినది అని నిర్ణయించవలసి వచ్చి  నప్పుడు, 108 ఉపనిషత్తులు కలిగిన వేదముల కంటే అర్ధము, గుణముల వివరణము, శబ్దముల ఆధిక్యము అన్ని కలిగిన ఈ భారతమే గొప్పది అని నిర్ణయించారు. అందువల్లనే భారతమును మహాభారతం అని సంబోధించుట పరిపాటి అయినది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి