31, జనవరి 2015, శనివారం

తెనాలి లో హనుమత్ చాలీసా పారాయణ మహాయజ్ఞం


 తెనాలి లో హనుమత్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఈనాటి (31 జనవరి 2015) ఉదయం బుర్రిపాలెం రోడ్డులో గల శ్రీ జానకి రామ హనుమత్ ప్రాంగణం లో అత్యంత భక్తీ శ్రద్ధలతో మొదలు పెట్టారు. మైసూరు అవధూత దత్త పీఠాధిపతులు శ్రీశ్రీగణపతి సచ్చిదానంద స్వామిజి అధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత మనోహరంగా కొనసాగుతూ ఉన్నది.
సహజంగా జరిగే హనుమత్ చాలీసా పారాయణకు భిన్నంగా ఇక్కడ ఒక్కసారి 40 శ్లోకముల చాలీసా చదవటం పూర్తి అవ్వగానే 1 లేదా 2 నిముషముల సమయం ఆగి, శ్రీ రామ నామం 4 సార్లు పలికి మరలా చాలీసా పారాయణం మొదలు పెడుతున్నారు. 111000 మంది భక్తులు ఈ చాలీసా చేస్తారు అని అంచనా మారి ఇప్పటివరకు సుమారుగా 125000 మంది పారాయణం చేస్తున్నారు.
అనేకమంది వాలెంటీర్లు స్వచ్చందంగా అక్కడకు చేరిన భక్తులకు కావలసిన సదుపాయములను చూస్తున్నారు. ఈ కార్యక్రమమునకు అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు కుడా విచ్చేశారు.
తెనాలి లో ఈరోజు వ్యాపారస్తులు స్వచందంగా తమ వ్యాపారములను ఆపేసి. వారు కూడా ఈ మహాయజ్ఞం లో పాలుపంచుకుంటున్నారు. తెనాలి తో అనేక మైన భద్రతా ఏర్పాట్లు చేసారు. ట్రాఫిక్ ను కూడా నియంత్రిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం అత్యంత మనోహరంగా, ఈవిధమైన అవంచనియమైన సంఘటనలు లేకుండా సాగుతోంది.
మన హిందూ సంప్రదాయమును ఒక తాటిపైకి తీసుకు వచ్చే ఇటువంటి అనేకమైన కార్యక్రమములు నా తెనాలిలో మరిన్ని జరగాలని కోరుకుంటూ

మీ
దీపిక 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి