9, జనవరి 2019, బుధవారం

శ్రీ శివ మహా పురాణం- శ్లోకముల సంఖ్య

మనం ఇంతకు ముందు పురాణములు 18 అని చెప్పుకున్నాం కదా! వానిలో నాలుగవది అయిన శ్రీ శివ మహాపురాణంను ముందుగా స్వయంగా మహాదేవుడే చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఆ పురాణము 12 సంహితలుగా చెప్పబడినది. అవి, వానిలోని శ్లోకముల సంఖ్య చుద్దాం!
  1. విద్వేశ్వర సంహిత – 10,000
  2. రుద్ర సంహిత – 8,000
  3. వినాయక సంహిత – 8,000
  4. ఉమా సంహిత – 8,000
  5. మాతృ సంహిత -8,000
  6. ఏకాదశ రుద్ర సంహిత – 13,000
  7. కైలాస సంహిత – 6,000
  8. శతరుద్ర సంహిత - 3,000
  9. కోటి రుద్ర సంహిత – 9,000
  10. సహస్త్ర కోటి రుద్ర సంహిత – 12,000
  11. వాయవీయ సంహిత – 4,000
  12. ధర్మ సంహిత – 12,000


అనగా మొత్తం 1,00,000 ఒక లక్ష శ్లోకములు ఉండేవి. తరువాతి కాలంలో పురాణములు రచించునప్పుడు వేదవ్యాసుడు శివపురాణమును 7 సంహితలుగా 24,000 శ్లోకములతో రచించాడని చెప్తారు. 
అవి 
  1. విద్వేశ్వర సంహిత
  2. రుద్ర సంహిత
  3. శతరుద్ర సంహిత
  4. కోటి రుద్ర సంహిత
  5. ఉమా సంహిత
  6. కైలాస సంహిత
  7. వాయవీయ సంహిత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి