30, డిసెంబర్ 2015, బుధవారం

విష్ణుశర్మ

శివశర్మ తన ముగ్గురు పుత్రులను వరుసగా పరీక్షించిన తరువాత తన నాలుగవ పుత్రుడయిన విష్ణుశర్మ ను పిలిచాడు.
శివ శర్మ విష్ణు శర్మతో ఇలా అన్నాడు " పుత్రా! ఈ స్త్రీ ని నేను ఇప్పుడే గ్రహించాను. ఈమె యవ్వనంలో ఉన్నది. నాకు శరీరంలో వృద్ధాప్యపు చాయలు ఉన్నాయి. కనుక వానిని నేను పోగొట్టు కొనేందుకు వీలుగా, నాకు నీవు అమృతం తెచ్చి ఇవ్వు " అని కోరెను.
తండ్రి కోరిక ప్రాకారం అమృతం తెచ్చే కోరికతో విష్ణుశర్మ స్వర్గానికి బయలుదేరాడు. విష్ణు శర్మ స్వర్గమునకు వస్తున్నాడు అని తెలుసుకొన్న ఇంద్రుడు ఆతనిని దారిలో ఆపాలన్న ఆలోచనతో మేనకను అతనిని ఆపే పని కై నియమించాడు.
ఆ మేనక విష్ణుశర్మ వచ్చే దారిలో ఒక ఉద్యానవనంలో ఉయ్యాలలూగుతూ పాటలు పాడుతూ ఆతనిని ఆకర్షించే ప్రయత్నం చేసినది. ఆమె పాటలు వినీ, వినని వానివలె, ఆమెను చూసీ చూడని వానివలే విష్ణుశర్మ ముందుకు సాగిపోసాగాడు. ఐనా మేనక ఆతని వెనుకనే వచ్చి ఆతనితో మాటలు కలిపినది. ఎక్కడికి వెళుతున్నావు? ఎందుకు వెళుతున్నావు అంటూ! కానీ విశ్నుషరం ఆమె అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పి, ఆగకుండా వెళ్ళటం చూసి,మేనక తన సహజ స్వభావం తో ఆతనిని నిలువరించే ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నములు గ్రహించిన విష్ణుశర్మ " ఓ మేనకా! నేను శివశర్మ పుత్రుడను. ఇట్టి మాయలకు లొంగే వానను కాదు. నీ ప్రయత్నములు నావద్ద చేయకు" అని మెత్తగా మందలించి, తన దారిన తను వెళుతూ ఉన్నాడు.
మేనక తన ప్రయత్నంలో వెనుతిరిగినది అని తెలుసుకున్న ఇంద్రుడు సింహం, పులి వంటి క్రూర జంతువులను సృష్టించి విష్ణుశర్మ మీదకు ప్రయోగించాడు. అవి కూడా విష్ణుశర్మను నిలువరించలేక పోవటంతో ఈ సారి ఇంద్రుడు రాక్షస గణములను సృష్టించి అతనిమీదకు ప్రయోగించాడు. అన్నింటిని తన పితృభక్తి వలన ఎదుర్కొన్న విష్ణుశర్మ ఈసారి ఇంద్రుడు బాణ వర్షం కురిపించుతచే కోపగించాడు. "నేను మా తండ్రి ఆజ్ఞ మేరకు అమృతం తీసుకు రావటానికి వస్తుంటే, ఇంద్రుడు నిర్ధాక్షిణ్యం గా నా మీదకు యుద్ధానికి కాలుదువ్వు తున్నాడు కనుక ఇతనిని ఈ ఇంద్రపదవి నుండి తప్పించి మరొకరిని ఇంద్రుడుని చేస్తాను" అని కన్నులు ఎర్రవిగా అయి ఉన్న విష్ణుశర్మను చూసి భయపడిన ఇంద్రుడు "ఓ బ్రాహ్మణోత్తమ! నేను నీకు సకల దేవతలతో కలసి నమస్కరిస్తున్నాను! నీకు కావలసిన వరం కోరుకొనుము ఇచ్చెదను" అని అన్నాడు. వెంటనే తనకోపమును తన వసంలోనికి తెచుకున్న విష్ణుశర్మ "ఓ ఇంద్రా!నేను మా తండ్రిగారి ఆజ్ఞ మేరకు అమృత కలశం కోసం వచ్చాను. నీవు నాకు వరం ఇస్తాను అన్నావు కనుక, ఆ అమృత కలశంతో పాటుగా నాకు అచంచలమైన పితృభక్తిని ఇవ్వు" అని కోరెను.
ఇంద్రుడు అలాగే అని అమృత కలశమును విష్ణుశర్మకు ఇచ్చెను. ఆ కలశంతో  విష్ణుశర్మ తండ్రిని సమీపించి జరిగినది చెప్పి, ఆ కలశమును  తండ్రికి సమర్పించెను.
ఈ విధంగా నాలుగవ పుత్రుదయినా విష్ణు శర్మ పరీక్ష ముగిసినది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి