2, మార్చి 2022, బుధవారం

దశగ్రీవుడు - మండోదరి వివాహం

 మనం ఇంతకు ముందు దశగ్రీవుని గురించి, అతని  మూర్ఖత్వం పక్కన ఉన్నవారి వలన ఏ విధంగా పెరుగుతోందో తెలుసుకున్నాం కదా! పంచకన్యలలో ఒకరయిన మండోదరిని దశగ్రీవుడు ఎలా వివాహం చేసుకున్నాడు అని ఇప్పుడు తెలుసుకుందాం!

దశగ్రీవుడు కుబేరుని గెలిచిన తరువాత అతని పుష్పకవిమానం లాక్కుని గర్వంతో ప్రవర్తిస్తున్న సమయంలో అనుకోకుండా ఒకసారి వారికి దితి పుత్రుడు దైత్యులలో ఒకడయిన మయుడు అతని కుమార్తె మండోదరిని కలిశాడు. 

అప్పుడు మయుడు తన భార్య ఒక అప్సరస  అని, ఆమె కొంతకాలం అతనితో గడిపిన తరువాత మాయావి,దుంధుభి అనే ఇద్దరు పుత్రులను, మండోదరి అనే ఈ పుత్రికకు జన్మను నిచ్చిన తరువాత దేవలోకమునకు వెళ్ళో తిరిగిరాలేదు అని, ఇప్పుడు మండోదరికి వివాహ వయస్సు వచ్చినందు వలన తగిన వరునికోసం చూస్తున్నానని చెప్పాడు. దశగ్రీవుడు కూడా తనని తాను పరిచయం చేసుకున్నాడు. తాను పులస్త్యుని మనుమడిననీ, విశ్రవనుని పుత్రుడననీ తన పేరు దశగ్రీవుడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న మయునికి ఒక ఆలోచన తట్టింది. 

అప్పటికే దశగ్రీవుని గురించి, అతని దుర్వ్యవహారముల గురించి, అతని అన్నతోనే యుద్ధం చేసిన విషయం గురించి అన్నీ తెలిసినా మయుడు తన కుమార్తెను దశగ్రీవునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. ఆ ప్రస్థావనను దశగ్రీవుడు అంగీకరిం చాడు. అప్పుడు అక్కడికి అక్కడే అగ్నిసాక్షిగా వివాహం చేయించాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి