13, మార్చి 2015, శుక్రవారం

నేను చదివిన ఒక మంచి టపా

జ్యోతిష శాస్త్రమా? విజ్ఞాన శాస్త్రమా? అని రాజసులోచనం గారు రాసిన టపా చాలా బాగుంది.
ఒకరు మూఢనమ్మకం అంటారు. ఒకరు శాస్త్రం అంటారు. ఒక నిజమును  దాచి అది అబద్దం అబద్దం  అని వంద సార్లు ప్రచారం చేసినంత మాత్రాన అది అబద్దం అయిపోదు కదా! మన విజ్ఞానం, మన జ్ఞానం పూర్వికుల నుండి మనకు ప్రాప్తించిన అత్యంత అమూల్యమైన నిధి. అది నిధి అని కొందరు చెబుతున్నా దానిని నమ్మకుండా వితండవాదములు, పిడి వాదములు చేసే పిచివాళ్ళు ఎక్కువ కదా! వారిని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు కనుక నిజమును  నిరూపించుకోవటానికి (సాద్వి మా తల్లి సీతకే తప్పలేదు కదా!) కొన్ని పరిక్షలకు పూనుకోవలసినదే.
ఈ సృష్టిలో మనం మనకు తెలిసిన, మనం అర్ధం చేసుకున్నది ఎంత మాత్రమో ముందు మనకు తెలిస్తే, అప్పుడు ఏది సాస్త్రమో ఏది శాస్త్రం కాదో తెలుస్తుంది. "కోడి ముందా? గుడ్డు ముందా?" అనే ప్రశ్నలను ముందు పెట్టుకుని దాని మీద గంటలు గంటలు కార్యక్రమములు నిర్వహించి చివరకు మనకెందుకు అని నిట్టూర్చే అలవాటు ఉన్న సామాజిక భాద్యతగల అనేక చానళ్ళు దీని గురించి అంతగా పట్టించుకోవు. కానీ ఈ రోజు మొదలయిన ఈ పరిశోధన మన మున్డుతరముల వారికి తప్పకుండ మార్గదర్శకం అవుతుందని ఆశిస్తున్నాము.

దీపిక 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి